నేటిసాక్షి, కరీంనగర్ :
ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్ లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు, సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. తను మహా కుంభమేళా నుండి వస్తున్నానని ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెబుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగిన తాను ముందుంటాానని తెలిపారు.





