Friday, March 27, 2026

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు గిట్టుబాటు ధరల సమస్యలపై ఈరోజు 5-3-2025 తేదీన అన్నమయ్య జిల్లా జెసి గారికి అన్నమయ్య జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగమల్ల రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. వంగమల రంగారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదేశాల ప్రకారంగా ఈ రోజు రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనకు మద్దతు తెలియజేస్తూ మొన్న అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ ను వెంటనే మంజూరు చేసి రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు మార్చి నెలలో రైతుల అకౌంట్లో జమ చేయాలని అదేవిధంగా రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని లేదా రైతుల దగ్గర ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి న్యాయం జరిగేలా చేయాలని అదేవిధంగా బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ బడ్జెట్లను అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టును తగిన బడ్జెట్ను కేటాయించి ఈ అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలని అదేవిధంగా వెలుగులు ప్రాజెక్టు చిన్న కాలువలు పెద్ద కాలువలు పూర్తిచేసి ఆ కాలువలు కింద ఉన్నటువంటి చెరువులకు నీళ్లు అందించాలని ఈ సమావేశం లో తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి పాల్గొన్న రాయచోటి ఏరియా కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి అధ్యక్షుడు హరినాధ నాయుడు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News