- తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ గరిక సుధాకర్
నేటి సాక్షి – మేడ్చల్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం నూతనంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకాన్ని యువతి యువకులకు బాసట అవుతుందని, తెలంగాణ ఓబిసి కన్వీనర్ గరిక సుధాకర్ అన్నారు, ఈ పథకం అమలుకు సహకరించిన ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల మంత్రి ఉప్పల్ ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వివా వికాస పథకాన్ని అమలు చేస్తుందని మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు జరుగుతుంది ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ పథకం ద్వారా యువతి యువకులకు తమ కాళ్ళపై తమ నిలబడి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు యువతకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్వహించింది జిల్లాలో బి బి సి ఎస్ సి ఎస్ టి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాలను అమలు జరుగుతుంది మార్చి 17న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఆర్థిక సహాయం కోసం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ యువతి యువకులకు చేసుకున్న దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు పరిశీలించి అష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారుల జాబితాలో ప్రకటించడం జరుగుతుంది అని గణిత సుధాకర్ అన్నారు.





