నేటిసాక్షి, (కె గంగాధర్ )పెగడపల్లి : పెగడపల్లి మండలంలోని అంబేద్కర్ చౌరస్తా లో హెడ్ కానిస్టేబుల్ రవీందర్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపైన అవగాహనా సదస్సును నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలు గంజాయి లాంటి మారకద్రవ్యాలు తీసుకోవద్దని దీనివలన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వున్నదన్నారు, అలాగే ప్రజలు బ్యాంకునుండి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ నెంబర్ చెప్పమంటే చెప్పవద్దు అన్నారు దీనివలన మనకు సంబందించిన అకౌంట్ నుండి డబ్బులు కోల్పోయే సందర్భాలు ఉన్నాయన్నారు అదేవిధంగా, హెల్మెట్ ప్రతిఒక్కరు వాహనం నడిపేటప్పుడు ధరించాలని సూచించారు, ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ రవీందర్,పీసీ లు సంపత్, రవీందర్, ఎల్లన్న, గ్రామ ప్రజలు ఇతరులు పాల్గొన్నారు





