- కేసు నమోదు చేసిన పోలీసులు
నేటి సాక్ష, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల); హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సమాచారం మేరకు కమలాపూర్ పోలీసులు అంబాల గ్రామంలోని పఠాన్ బడే సాబ్ s/o. ఇమామ్ మరియు దొడ్డిపాటి పోషయ్య, s/o. సాయిలు ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ నిషేధిత గుట్కా పాన్ మసాలా లనూ వారి షాప్ నందు కల్గి ఉన్నారనే సమాచారం మేరకు రైడ్ చేయగా వాటిని సీజ్ చేసి, అట్టి వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని వాటి విలువ బడే సాబ్ వద్ద లభించినవి 4175/- రూపాయలుగాను మరియు పోషాలు వద్ద లభించిన 4005/- రూపాయలు ఇట్టి సంఘటన పై రెండు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఈ.హరికృష్ణ
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమలాపూర్ తెలిపారు.




