నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) :
ఈరోజు సింగరేణి బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నియమింపబడిన అర్జీ.1 బీసీ లైజన్ అధికారి పెరుమాళ్ళ శ్రీనివాస్ జిఎం పరిచయం చేస్తూ బిసి అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణను జిఎం శ్రీ లలిత్ కుమార్. చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిఎం మాట్లాడుతూ… ముందుగా అందరికీ అభినందనలు తెలిపారు, బీసీ సంక్షేమం కోసం కృషి చేస్తానని బీసీ యొక్క ఐక్యత లో ఉండే శక్తిని వివరిస్తూ సింగరేణి తీసుకునే అన్ని నిర్ణయాలు బీసీ అభ్యున్నతికి పాటుపడతాయని జిఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ ముఖ్య సలహాదారు చిలక శ్రీనివాస్ బీసీ ఏరియా లైసెన్ ఆఫీసర్ పెరుమాళ్ళ శ్రీనివాస్ ప్రెసిడెంట్ పి వసంత్ కుమార్, జనరల్ సెక్రెటరీ వుట్ల దేవాచారి, ట్రెజరర్ దేవులపల్లి రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ చందా శ్రీనివాస్, చిందం శ్రీనివాస్, కోలా మల్లేశం హనుమాన్ల నవీన్. అన్ని మైన్ కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.





