- జగిత్యాల ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్
నేటిసాక్షి, రాయికల్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ వైద్య సిబ్బందికి సూచించారు. రాయికల్ పట్టణంలోని బస్తీ దవాఖానాను ఆయన సోమవారం సాయంత్రం సందర్శించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. క్షయ వ్యాధి నివారణకు పెద్దల బిసిజి టీకాకు అర్హులను గుర్తించి అన్లైన్లో నమోదు చేయాలన్నారు. వీరి వెంట హెచ్ఇఓ సాగర్రావు, పర్యవెక్షకులు ఇల్లెందుల శ్రీనివాస్,ఎ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.





