- కల్యాణ్స్కూల్లో బోనాల పండుగ
నేటి సాక్షి, పటాన్చెరు: సాయి కాలనీలోని కల్యాణ్పాఠశాలలో శనివారం బోనాల పండుగును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ థాకూరు కిన్నెర మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగని, తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మన సంప్రదాయాలు, సంస్కృతి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు తయారు చేసిన బోనాలను ఊరేగింపుగా విద్యార్థులతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి కుమారి, సుప్రియ, తులసి, ఇంద్ర, జరీనా, లిఖిత, భాగ్యలక్ష్మి, స్వాతి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
