నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) :
గద్వాల్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్ల ఆగడాలు మితిమీరి పోయాయని గద్వాల్ సిఐ టంగుటూరి శ్రీను మండి పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్ లతో సమావేశం నిర్వహించారు. బలవంతపు వసూళ్లు చేయకూడదని హెచ్చరించారు. శుభకార్యాల్లో ఇండ్లకు వెళ్లి హల్చల్ చేయడం వంటి పనులు చేయకూడదన్నారు. ఆగడాలు ఆపకుంటే కఠినంగా చర్యలు ఉంటాయని.. కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.





