నేటి సాక్షి,వేమనపల్లి; మండల కేంద్రంలో పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి,కొమరయ్య విజయం సాధించడం పట్ల మండల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి విజయోత్సవ సంబురాలు జరిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఏట మధుకర్ మాట్లాడుతూ ఈ విజయం సాధించి తమ వంతు మద్దతుగా నిలిచినా మండలంలోని ప్రతి ఓటర్ కి కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



