Tuesday, March 24, 2026

మార్చు 2వ తేదీ ఆదివారం వనపర్తికీ రానున్న ముఖ్యమంత్రి

  • మంగళవారం ముఖ్యమంత్రిని కలిసిన నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు
  • డాక్టర్ మల్లు రవి, వనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. వచ్చే నెల మార్చ్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి రానున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలో మంగళవారం నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా వనపర్తిలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రి కి అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో వనపర్తిలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నట్లు వారు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News