- కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పార్టీ పెద్దలకు, యువకులకు, డప్పు కళాకారులకు, బతుక మ్మలెత్తిన మహిళలకు, మండల నాయకులకు వనపర్తి పట్టణ నాయకులకు, పెద్దమందడి, ఖిల్లా గణపురం, గోపాల్పేట, రేవల్లి,ఏదుల, పెబ్బేరు, శ్రీరంగాపురం, వనపర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలందరికీ కృతజ్ఞతలు.




