Tuesday, January 20, 2026

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే నిర్వహణ

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
జిల్లాలో ఇదిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను యాప్ ద్వారా సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ చౌరస్తా వద్ద 35 వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలని, ప్రజలు కూడా అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసి సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్ లతో సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేటర్ లు సకాలంలో సర్వే పూర్తి చేయాలి. అవసరమైతే అదనంగా లాగిన్లను రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితి గతి తెలిసేలా ఫోటోలను యాప్ లో అప్లోడ్ చేయాలి అని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని తెలిపారు. తనిఖీలలో జిల్లా కలెక్టర్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News