-తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్.
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
2018లో విద్యార్థి ప్రణయ్ ని సూపరీ గ్యాంగ్ తో హత్య చేయించిన సెన్సేషనల్ కేసులో నిందితులకు శిక్షలు పడేలా చేసిన అప్పటి డి.ఎస్.పి పద్మనాభుల శ్రీనివాస్ కృషి అభినందనీయమని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హుజురాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ కు చెందిన మారుతీ రావు తన కూతురు పి ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది అన్న ఆక్రోషంతో సుపారీ గ్యాంగ్ మాట్లాడి అత్యంత దారుణంగా హత్య చేయించడం ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సంచలనం కలిగించిందన్నారు. హత్య జరిగిన సమయంలో మిర్యాలగూడ డిఎస్పీగా ఉన్న పద్మనాగుల శ్రీనివాస్ 8 మంది నిందితులను దోషులుగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ హైడ్రాలో ప్రత్యేక అధికారిగా కొనసాగుతుండగా సంచలనం కలిగించిన కేసులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా కృషిచేసిన శ్రీనివాస్ కృషి పోలీస్ డిపార్ట్మెంట్ కి గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా పరువు హత్యలకు పాల్పడితే శిక్షలు తప్పవు అన్న రీతిలో పోలీస్ అధికారిగా డిఎస్పి శ్రీనివాస్ కృషిచేసి పోలీసు డిపార్ట్మెంట్ పరువు నిలబడమే కాక పరువు హత్యలను అరికట్టడంలో తనదైన శైలిలో వ్యవహరించడం రాష్ట్రానికే గర్వకారణమని అర్జున్ పేర్కొన్నారు. నిందితులకు శిక్ష ఖరారు కావడంలో సాక్షులను ప్రవేశపెట్టి కృషి చేసిన డిఎస్పి శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.



