నేటి సాక్షి – మేడ్చల్ జిల్లా ప్రతినిధి : ఉప్పల్ డివిజన్ అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్నేని ఫణిందర్ ను ఉప్పల్ డివిజన్ లక్ష్మీ నగర్, సూర్య నగర్ కాలనీ బిజెపి నాయకులు సంక్షేమ సంఘం నాయకులు, ఉప్పల్ డివిజన్ బూత్ నెంబర్లు 322,323,324,325, గల బూతు అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా శాలువాలతో సన్మానం చేసి పూల బొకే లతో సత్కరించారు. అనంతరము స్వీట్లు పంచుకున్నారు, ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మేకల దయాసాగర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ సుపరిచితులైన ఆత్మీయుడు విద్యాధికుడు వితరణ శీలి ఉద్యమ నాయకుడు మార్నేని ఫణిందర్ కు ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన బిజెపి పార్టీ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి, మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డికి ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కు, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ ప్రాంత బిజెపి సీనియర్ నాయకులు శామీర్పేట ధర్మారెడ్డికి బలవంత చారి కి పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ పదవికి వన్నె తెచ్చే విధంగా మార్గ నిర్దేశం చేసుకొని కార్యకర్తలను నాయకులను అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని ముందుకు నడవాలని ఎలాంటి కార్యక్రమాలైనా నేను నా సైన్యం మీ వెంట ఉంటుందని మేకల దయాసాగర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉప్పల్ ప్రాంత బిజెపి సీనియర్ నాయకులు షామీర్పేట్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే గుణముతోటే తనకి ఈ అదృష్టం వచ్చిందని పార్టీలలో వర్గ భేదాలు లేకుండా పార్టీ ప్రతిష్టతను కాపాడాలని తను వెన్నంటే ఉంటానని మాట్లాడారు, బిజెపి యువ నాయకులు పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ నిబద్ధతగల నాయకుని క్రమశిక్షణ గల మనిషిని అధ్యక్ష పదవి ఇచ్చి నందుకు రాష్ట్ర నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే పార్టీకి ప్రజలకు సేవ చేస్తూ మీరు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఉప్పల్ ప్రాంత ప్రసిద్ధి అయిన సీతారాములోరి ని మనసారా వేడుకుంటూ నిరంతరము పార్టీ కోసం పని చేస్తామని ఫణిందర్ వెంబడే ఓ సైన్యంల ఉంటామని అన్నారు, అనంతరము ఉప్పల్ నూతన అధ్యక్ష పదవి చేపట్టిన మార్నిని ఫణిందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీ ఆశయాలను సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేస్తానని ఉప్పల్ ప్రాంత ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటూ ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఉప్పల్ డివిజన్ ప్రాంతంలో పార్టీ పటిష్టత పరచడానికి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని తూచా తప్పకుండా కాపాడుతానని పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీకి పదవికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు డివిజన్ ప్రతి కార్యకర్తకు నాయకులకు సీనియర్ నాయకులకు శుభాభివందనములు తెలియజేస్తున్నానని అన్నారు, ఈ కార్యక్రమంలో శామీర్పేట ధర్మారెడ్డి, మేకల దయాసాగర్ రెడ్డి, షామీర్పేట్ హనుమంత రెడ్డి, ఉప్పోజి బలవంత చారి, ఉప్పల్ డివిజన్ మాజీ కార్యదర్శి తీగ విట్టల్ రావు ముదిరాజ్, శ్రీధర్ గుప్తా, మేకల ఇంద్రసేనారెడ్డి బట్కూరి రాముగౌడ్ సూరెడ్డి చంద్రారెడ్డి కట్ట కృష్ణారెడ్డి, రెడ్డి స్వామి గౌడ్ శ్రీను గౌడ్ జ్యూస్ అనిల్, నితీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.





