
నేటి సాక్షి, ప్రతినిధి తిరుపతి జిల్లా :
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని సినీ నటులు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబుకు చెందిన పాఠశాల వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ విద్యా సంస్థల లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా కళాశాల వద్దనున్న బౌన్సర్ లకు తన వెంట తీసుకుని బౌన్సర్ లకు మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురు సద్దు చెప్పారు అనంతరం మనోజ్ అవ్వా తాతలు సమాది వద్దకు వెళ్ళి మ్రొక్కి వెను తిరిగారు దీంతో మంచు మనోజ్ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నిర్వాహకులు పోలీసులతో అన్నారు. శ్రీ విద్యా సంస్థల నిర్వాహకులు పోలీసులతో మాట్లాడుతూ విద్యానికేతన్ విద్యా సంస్థలలోకి మంచు మనోజ్ ప్రవేశించకూడదని కోర్టు ఆజ్ఞలు జారీ చేసిందని చెప్పారు.అయితే మంచు మనోజ్ తన మేనత్త ఉన్న నారావారిపల్లికి సాకు చెప్పి విద్యానికేతన్ సంస్థల ప్రధాన గేటు వద్ద పోలీసులు నివారించిన గోడ దూకి లోపలికి ప్రవేశించారని ఆరోపించారు ప్రశాంతమైన విద్యాసంస్థలలో అలజడి సృష్టించడానికే మనోజ్ ప్రయత్నించారని, ఆయన పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.





