Sunday, March 29, 2026

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి కలెక్టరేట్ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, ఎలాంటి అలసత్వం సహించేది లేదని జూమ్ మీటింగ్ ద్వారా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీ రాజ్, డ్వామా, ఎంపిడిఒలు, సంబందిత అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన సిసి రోడ్లు పనుల పురోగతి పై వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గ్రామ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు పనులపై పురోగతి చూపాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్ష్యం మేరకు సి సి రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. అధిక మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయని పురోగతి చూపించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ ఈఈ, డిఈ లు, ఏఈ లు, ఎంపిడిఓ లు, ఎ పి ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News