నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ వారు శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించడానికి వచ్చిన ధర్మపురి సీఐ రామ్ నర్సింహారెడ్డి గొల్లపల్లి ఎస్సై సతీష్. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కమిటీ వారిని అభినందించి చైర్మన్ దాసరి తిరుపతి గౌడ్ వైస్ చైర్మన్ సింగారపు కొమురయ్య సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నక్క కొమురయ్య, సికినికాంతం నాగయ్య, గంధం నర్సయ్య, అల్లాడి వేణు, అల్లాడి గోపి, గట్ల శ్రీధర్, ఆలయ అర్చకులు బజరంగం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




