నేటి సాక్షి,మెట్ పల్లి: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 1,201,392/- పన్నెండు లక్షల ఒకవేయ్యి మూడు వందల తొంభై రెండు రూపాయల విలువ గల 12 కళ్యాణ లక్ష్మి,షాధి ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా చెక్కుల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుంకెట. గంగాధర్, మాజీ సర్పంచ్. తిరుపతి రెడ్డి, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




