Thursday, March 19, 2026

జైన్ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి హాజరైన డాలర్స్ గ్రూప్ అధినేత

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి రూరల్: డాలర్స్ గ్రూప్ అధినేత తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు శ్రీ దేవాసి సమాజ్ మహమండల్ వారి ఆహ్వానం మేరకు తిరుపతి దామినేడు సమీపంలో నూతనముగా ఏర్పాటు చేసిన శిర్ ప్రంచంద్ ఆలయ పునరుద్ధరణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన దివాకర్ రెడ్డికి జైన్ మత గురువులు సాంప్రదాయ పద్ధతుల్లో ఆయనకు స్వాగతం పనికి ఆశీర్వచనాలు అందించారు. ఈ క్రమంలో ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, స్థానిక నాయకులు అన్న రామచంద్ర తదితరులు హాజరయ్యారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం దగ్గరలోని బి జి ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు విచ్చేసిన శ్రీ స్వామీ బాలక్ నాథ్ జీ ని డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి, స్వామి వారి ఆశీర్వాదం స్వీకరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News