
నేటి సాక్షి. మెదక్. (భూమయ్య) : ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి. డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్ గారు కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధి లో ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ మృతధేహానికి పూలమాల వేసి నివాళు అరిపించారు. సాయి కుమార్ కుటుంబానికి పరామర్శించి అన్నీ విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.సాయి కుమార్ మరణ వార్త పోలీస్ యంత్రాంగాన్ని కలచివేసిందని, ప్రగడ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ మరియు రూరల్ సిఐ శ్రీ. రాజశేఖర్ రెడ్డి మరియు నర్సాపూర్ ఎస్ఐ లింగం, కుల్చారం ఎస్ఐ. గౌస్ పాల్గొన్నారు.

