Friday, August 1, 2025

రెనే హాస్పిటల్​లో కాలం చెల్లిన మందులు..

– డ్రగ్స్​ ఇన్ స్పెక్టర్​కు హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్ ఫిర్యాదు

నేటి సాక్షి, కరీంనగర్​: కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరీనంగర్​పట్టణంలో ఇందిరానగర్​లో ఉన్న రెనే హాస్పిటల్​పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్​డ్రగ్స్​ఇన్​స్పెక్టర్​కు గురువారం హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సతీష్​మాట్లాడుతూ ఇటీవల ఒక మహిళకు అనారోగ్యంతో హాస్పిటల్​లో హెల్త్ చెకప్ కోసం వచ్చిందని, డాక్టర్ పరిశీలించి మందులు రాయగా, మందులు తీసుకోవడానికి ఆస్పత్రిలోని మందుల షాపునకు వెళి మందులు తీసుకుందన్నారు. అందులో ఒక షీట్ ఎక్స్​పైరీ డేట్ అయిపోయినా దానిని రోగికి ఇచ్చారన్నారు. ఈ విధంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి లైసెన్సు రద్దు చేయాలని డ్రగ్స్ ఇన్​స్పెక్టర్​ను కోరినట్టు సతీష్​తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కమిటీ సభ్యులు, జిల్లా సెక్రెటరీ వేముల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News