- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చని వాళ్ళు ఢిల్లీలో హామీలు ఇస్తున్నారని ఇది హాస్యస్వధమని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. షాబాద్ లో చేసిన రైతు ధర్నాలు కేటీఆర్ తో కలిసి ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు నెరవేర్చలేక ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి ప్రజలను మభ్యపెట్టడమే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని తెలియజేశారు.





