
నేటి సాక్షి, వీణవంక :
జిల్లా వ్యవసాయ అధికారిని ఈరోజు వీణవంక మండలంలో పలు గ్రామాల్లో ఇంటింటి సర్వేలో మరియు రైతులకు అందించే ఫర్టిలైజర్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని నర్సింగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం, చల్లూరు ఫర్టిలైజర్లను తనిఖీ చేశారు. మరియు ఇంటింటా సర్వేలో పాల్గొని మామిడాలపల్లి, శ్రీరాములపల్లి పలు గ్రామాల్లో ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇందులో భాగంగా మండలంలోని కొండపాక గ్రామ లో రెవెన్యూ అధికారితో మరియు వ్యవసాయ ఏ ఈ ఓ తో కలిసి సర్వే చేయగా వ్యవసాయ సాగు లేని భూమిని 15 ఎకరాలుగా ఇసుక రీచ్ గా గుర్తించారు.





