నేటిసాక్షి /మంగపేట : మండలంలో బుచ్చంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడ్డం సంతోష్ గత వారం క్రిందట అనారోగ్యంతో ప్రవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాగా సోమవారం దశదిన కర్మలకు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించి 5000 (ఐదు) వేలు రూపాయలను ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేసి కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చి ఓదార్చడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి మాజీ సర్పంచ్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటూరి నాగయ్య కార్యదర్శి రాచకొండ సోమయ్య గడ్డం శ్రీహరి పల్లె శోభన్ గడ్డం పరమెష్ మండల కార్యదర్శి ఎంపెళ్లి సమ్మయ్య యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భానుచందర్ ఎడ్ల నరేష్ పన్నాల కొండల్ రెడ్డి నక్క శ్రీనివాస్ దార ధర్మయ్య పగిడిపల్లి రవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



