నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలోని శివాలయం ఆవరణలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఆవుల పోషణ కోసం అందించిన పశుగ్రాసం అగ్నికి ఆహుతి అయింది. రూ.50వేల నష్టం జరిగినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పశుగ్రాసం దగ్దం కావడంతో పశువులకు గ్రాసం కొరత ఏర్పడిందని దాతలు ముందుకు వచ్చి పశుగ్రాసం అందించాలని ఆలయ నిర్వహకులు కోరారు.



