నేటిసాక్షి, (కె గంగాధర్ ) : పెగడపల్లి మండలం లో క్షేత్రస్థాయిలో ఆహార భద్రత కార్డు ల సర్వే కార్యక్రమంలో భాగంగా అర్హులైన కుటుంటుంబాలను సందర్శించి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అందేలా తహసీల్దార్ రవీందర్ చూస్తామన్నారు. అదేవిదంగా జాబితాలో లేని వారి పేర్లను ప్రతి గ్రామం లో గ్రామ సభ రోజున రిజిస్టర్ చేసుకుంటామని దాని కోసం కార్యదర్శులకు తగు సూచనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి, మండల తహసిల్దార్ బి. రవీందర్, మండల పంచాయతీ అధికారి మహేందర్ పాల్గొన్నారు





