నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం పర్యటించారు. రాజారాంపల్లి మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం సోదరుడు గాజుల రామస్వామికి ఇటీవలే గుండె సంబంధిత శస్త్రచికిత్స జరగగా కొప్పుల వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, నాయకులు పెద్దూరి భరత్, జుపాక కుమార్, దుర్గం కృష్ణ, దేవి నరేష్, వెంకటేష్, జక్కుల తిరుపతి, సిరిమల్ల గురవయ్య, మంతెన సతీష్ తదితరులు ఉన్నారు.




