నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి, (గుండ ప్రశాంత్ గౌడ్) : గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించే భాగంలో శనివారం రోజున గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో వాలీబాల్ క్రీడాకారులకు మాజీ సర్పంచ్ కాసరపు అరవింద్ గౌడ్ వాలీబాల్ మరియు నెట్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని రాబోయే రోజులలో మండల స్థాయి జిల్లా స్థాయి క్రీడల్లో రానించి రాఘవపట్నం గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని కోరువడం జరిగింది. ఇందులో జగిత్యాల జిల్లా వాలీబాల్ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, ప్రవీణ్, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు జలంధర్ మల్లయ్య,అశోక్,రమేష్, శ్రీకాంత్ మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.





