- ఎవరికి వారే విజయవకాశలపై ధీమా
- బెజ్జంకి మండలంలో 75.10% పోలింగ్
నేటి సాక్షి, బెజ్జంకి:
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా, బెజ్జంకి మండలంలోని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం పట్టభద్రుల ఓట్లు: 1,434,పోలైన ఓట్లు: 1,077,పోలింగ్ శాతం: 75.10%, మొత్తం టీచర్ల ఓట్లు: 48,పోలైన ఓట్లు: 44,పోలింగ్ శాతం: 91.06%,పండుగ వాతావరణంలోనూ ఓటింగ్ ప్రాధాన్యతను గుర్తించి, పట్టభద్రులు హక్కును వినియోగించుకోవడం విశేషం. విజయావకాశాలపై తమ తమ అనుచరులు మాదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్చి 3 న ఎన్నికల ఫలితాల వేళా భవితవ్యం తేలేది ఎవరికో పట్టభద్రుల ఓటు ఎటు వైపు అనేది వేచి చూడాల్సిందే.




