నేటి సాక్షి, కొడిమ్యాల, జనవరి 23 : కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో తహసిల్దార్ రమేష్ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభ లో గురువారం నాచుపల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన ఆరు పథకాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదు. మా గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలు వర్షాకాలంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న కల్వర్టు చిన్నగా ఉండడంతో పెద్ద వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు పంచాయతీ కార్యాలయం లోకి రావడమే కాక ప్రధాన రోడ్డుపై నీళ్లు ప్రవహించడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోతున్నాయని అధికారులు మా సమస్యలు తీర్చాలని వాగ్వాదం చేయగా విషయం తెలుసుకున్న మల్యాల సిఐ నీలం రవి స్థానిక ఎస్సై సందీప్ పోలీస్ బృందంతో వచ్చి గ్రామ సభలో మాట్లాడుతున్న ప్రజలను అదుపు చేయగా పోలీసుల భద్రతతో గ్రామసభ ముగించుకొని ప్రజలు అధికారులు అక్కడ నుండి వెళ్లిపోయారు.





