నేటి సాక్షి, వేమనపల్లి : నీల్వాయి నుండి గొర్లపల్లి వంతెనపై ఇటీవల అప్రోచ్ రోడ్డు పూర్తి చేశారు. కానీ వంతెన సమీపంలో కొంత దూరం వరకు ఎలాంటి రక్షణ దిమ్మలు లేకపొడవడంతో ప్రమాదం పొంచి ఉంది. వాహనదారులు ఏం మాత్రం ఆదమరచినా వాగులోకి లేక పత్తి చెనులోకి దూసుకెల్లి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది ఆర్ & బీ అధికారులు స్పందించి వంతెనకు ఇరువైపుల కొద్ది దూరం వరకు రక్షణ దిమ్మలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.





