Wednesday, April 1, 2026

విద్యార్థులు పాఠశాలలకు మోటర్ సైకిల్ తీసుకువస్తే..

నేటి సాక్షి, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని పలుపాఠశాలలకు విద్యార్థులు బండ్లపై రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మాట్లాడుతూ మైనర్లు బండి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చెయ్యాలన్నారు. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ స్కూల్ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం అని సంతాపం తెలియజేశారు. అంతే కాకుండా ఇప్పటి నుండి ఏ పాఠశాల విద్యార్థి అయిన బండి వెసుకొని పాఠశాలకు వస్తే వారి యొక్క తల్లి దండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించాలని అన్నారు. ఇకనుండి పాఠశాలల విద్యార్థులు వాహనాలు వేసుకొని వస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో పాఠశాలల ముందు ధర్నాలు చేస్తామని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News