Friday, April 3, 2026

ఇష్టపడి చదివితే… ఉత్తమ ఫలితాలు వస్తాయి

  • తెలంగాణ అసైన్డ్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిక్కిరి శ్రీకాంత్

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు అనగా శుక్రవారం రోజు నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా… పదవ తరగతి పరీక్షలో రాస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పరీక్ష కేంద్రంలో భయభ్రాంతులకు చెందకుండా మనోధైర్యం తోటి పరీక్షలో కష్టపడకుండా ఇష్టంతో రాయాలని తెలియజేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్ష కేంద్రాలలో మీకు సంబంధిత సౌకర్యాలు లేనియెడల వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం చేరవేయాలి ఎలాంటి సమస్య ఉన్న మీకు అందుబాటులో ఉన్న ఉన్నత అధికారులు పోలీస్ సిబ్బంది కావచ్చు. మీడియా ప్రతినిధులు కావచ్చు మీకు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని సంప్రదించినట్లయితే వెంటనే మీకు సహకారం అందజేసే ప్రయత్నం తప్పకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు కాబట్టి మరొక్కసారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలంగాణ అసైన్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్
మీ చిక్కిరి శ్రీకాంత్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News