Wednesday, March 25, 2026

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

  • సైన్స్ టీచర్ లేక ఇబ్బంది పడుతున్న పదవ తరగతి విద్యార్థులు
  • స్కూల్ టీచర్ కోసం జిల్లా కలెక్టర్ ని కలిసిన తుమ్మలూరు గ్రామ యువకులు

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 2 నెలల నుండి సైన్స్ టీచర్ లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా పదవతరగతి విద్యార్థులకి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో వారు భయందోళనకి గురౌతున్నారు.ఈ సమస్య గురించి గ్రామ యువకులు, విద్యార్థుల తల్లితండ్రులు గత కొన్ని రోజులుగా ఎంఈఓ & డీఈవో కి ఏన్ని సార్లు విన్నవించిన ఉపయోగం లేకపోవడంతో ఈరోజు నేరుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గతంలో స్వయంగా ఒక టీచర్ గా వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే స్కూల్ విద్యార్థుల ఇబ్బందిని అర్థం చేసుకొని రేపటి నుండి తుమ్మలూరు స్కూల్ కి సైన్స్ టీచర్ ని పంపించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు కటికేల యాదగిరి, కళ్యాణ్ రెడ్డి, కార్తీక్, ఇతర గ్రామ యువకులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News