
నేటి సాక్షి, మెట్ పల్లి : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల నుండి నిజామాబాద్ కు ఎలాంటి అనుమతి లేకుండా మంగళవారం ఉదయం టీఎస్ 29 టిఏ 1945 లారీని పట్టణ శివారులో గల వట్టి వాగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నట్లు డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.రెవెన్యూ సిబ్బంది పిర్యాదు మేరకు ఎస్ఐ కిరణ్ కేసు నమోదు చేశాడని తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు అన్నారు. ఇకనుండి లారీ,ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేస్తే దొంగతనం కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.





