- జోహార్ సిగిరిపురం యాదయ్య నేడు జన్మదిన సందర్భంగా ఘన నివాళి
- తెలంగాణ అసైన్ భూమి సమితి రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిక్కిరి శ్రీకాంత్
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన సిగిరిపురం యాదయ్య తెలంగాణ అమరుడు సిగిరిపురం యాదయ్య జన్మదిన సందర్భంగా ఘన నివాళి గ్రామ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాను.
యాదయ్య నీకు వందనం! అభివందనం!
పోరాటాల పురుటి నుండి పుట్టిన బిడ్డడు. యాదయ్య అనారోగ్యం తోనో, కుటుంబ సమస్యతోనో, సమాజానికి అక్కరకు రాని సమస్యతోనో, మార్కండేయ పుత్రుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ మరణించలేదు. భారత దేశ స్వతంత్రోధ్యమంలో… ఎందరో మహానుభావులు పోరాడి మరణించిన 1969 లో తొలిదశ ,2010 లో ఉదృతమైన మలిదశ ఉద్యమంలో వందలాది మంది పోరాడి అత్మర్పణ చేసుకున్నారు. అందులో అంతకు మించిన త్యాగం చేశాడు యాదయ్య. 2010 సంవత్సరంలో ఓయూ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపు మేరకు ఓయూ ఎన్ సిసి గేటు దగ్గర పోలీస్ బలగాలు మొహరించి ముళ్లసంకెళ్లతో అడ్డగించి, లాఠి చార్చ్ చేస్తూ విద్యార్థులను చెదరగొడుతుండగా “జై తెలంగాణ” అను నినాదాలు చేస్తూ పోలీసుల వైపు పెట్రోలు క్యాన్ తో పరుగెత్తి తన ఒంటిపై పోసుకొని నిప్పటించుకొని మండుతున్న అగ్నిగోళంలో అహుతి అవుతున్న అమ్మా – నాన్నా అని కాకుండా జై తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణాన్ని అంకితం చేసిన వీరుడు మరో సర్దార్ సిరిపురం యాదయ్య.





