- విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
నెటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, జాతరలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.




