నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని ఎస్సి కాలనీ లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తల్లి దీవెనలు కాలనీ వాసులకు ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నారు.కాలనీ వాసులు ఎమ్మెల్యే ని శాలువతో సన్మానించారు. వీరితో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఏఎంసి వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ జెల్ల ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోనగిరి రూపేష్, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, మాజీ ఏఎంసి చైర్మన్ అక్కరవేణి పోచయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్, శానాగొండ శ్రావణ్, శానాగొండ శరత్, నాయకులు లింగాల లక్ష్మణ్, జేరిపోతుల మధు, బోనగం రమేష్, బోనగిరి ఎల్లయ్య, బోనగిరి శేషు, జుట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.




