నేటి సాక్షి, వేమనపల్లి : చెన్నూర్ బిజెపి కార్యాలయంలో శుక్రవారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు ఏట మధుకర్ సమక్షంలో కల్మలపేట గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ మాజీ మండల ఉపాధ్యక్షుడు సీపెళ్లి కిషోర్ నీ పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల మధునయ్య,కోయిల స్వామి,కొప్పుల చరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.





