నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని నూతన మండల విద్యాధికారి బాధ్యతలు చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసిన రామకిషన్ రాజు పదవి విరమణ తో పోస్ట్ కాళీ కాగా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇవాళ కమలాపూర్ మండల శనిగరం పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు కే శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంఈఓ కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించే అందించడమే లక్ష్యంగా,స్కూల్లో నెలకొన్న సమస్యల సాధనకు కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో సుభాష్, నాగేందర్,శ్రీనివాస్,స్వర్ణలత, స్రవంతి,కరుణ లు పాల్గొన్నారు.





