నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెగడపల్లి డబ్బాలు, గుండ్ల సింగారం ఏరియాలో కే యూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి గుండ్ల సింగారం స్మశాన వాటిక నందు 5 గురు వ్యక్తులు పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా వారివద్ద నుండి 270 గ్రాముల గంజాయి దొరికింది వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఇట్టి గంజాయి ని మహారాష్ట్ర నాగపూర్ నుండి తీసుకుని వచ్చి గుండ్ల సింగారం నందు గంజాయి సేవిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు మరియు గంజాయిని ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసీన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వివరాలు:
1) గాదె ఇజ్గే పాల్, తండ్రి పేరు: స్వామీ, గుండ్ల సింగారం, 2) బస్కుల భాస్కర్, తండ్రి పేరు: విష్ణు వర్ధన్, గుండ్లసింగారం 3) మాదాసి రాఘవ, తండ్రి పేరు: శరత్, గుండ్ల సింగారం 4) లావుడ్య నవీన్, తండ్రి పేరు : ఈర్య, గుండ్ల సింగారం 5) శిర్వాటి ఈశ్వర్, తండ్రి పేరు: సాయిలు, వాజ్పాయ్ కాలనీ హన్మకొండ అని ఎస్సై, సీ ఐ తెలిపారు.





