Sunday, March 22, 2026

రాచాలను కలిసిన ధూపదీప నైవేద్య అర్చక సంఘం నాయకులు

  • తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతి

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కి ధూపదీప నైవేద్య అర్చక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రాచాలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో నియమించినటువంటి త్రిమెన్ కమిటీ ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉందని, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు.కావున తమ సమస్యలపై దృష్టి సారించి ఉమ్మడి జిల్లా వారిగా కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాల వారిగా త్రీమెన్ కమిటీ నియమించే విధంగా కృషి చేయాలని రాచాలను కోరారు. దీనిపై స్పందించిన రాచాల యుగంధర్ గౌడ్ దూప దీప నైవేద్య అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు పీవీ లక్ష్మీకాంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్రావు, ఎం బాల లింగయ్య, ఉమ్మడి కార్యదర్శి జోషి శ్రీధర్, జూరాల రవి, వెంకోబా, గాండ్ల రవి, మహేష్, చక్రవర్తి, చంద్రశేఖర్ జ్ఞానేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News