- మరిపెడ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు
- సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి
- అక్రమ ఇసుక రవాణాకు నో ఛాన్స్
- ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
నేటి సాక్షి, మహబూబాద్ నరసింహుల పేట భూక్యా రవి : మరిపెడ బంగ్లా లోఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ గారు మరిపెడ సర్కిల్ మరియు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ లోపల 5S విధానాన్ని పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు..సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్.ఐసతీష్ మరియు ఎస్.ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.





