Tuesday, March 24, 2026

వనపర్తి జిల్లా ఆస్పత్రికి మహార్దశ

  • 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించిన ఆరోగ్యశాఖ మంత్రి
  • మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మార్చ్ 2వ తేదీన ముఖ్యమంత్రి తో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ.పెబ్బేరు పట్టణంలో 30 పడకల ఆసుపత్రికి సైతం శంకుస్థాపన చేయనున్న మంత్రులు.కృతజ్ఞతలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి.మార్చ్ 2వ తేదీ ఆదివారం వనపర్తి నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ రానున్నట్లు వనపర్తి శాసనసభ్యులుతూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News