- ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం
- కమలాపూర్ లో కాంగ్రెస్ శ్రేణుల ప్రచారం
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉటుకూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టభద్రుల ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడక శ్రీకాంత్,విష్ణుదాసు వంశీధరావు,శనిగరపు రమేష్, పుల్ల సునీల్,వైనాల సుభాష్, మాట్ల రాజేష్,శనిగరపు దినేష్, పుల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.





