నేటి సాక్షి ప్రతినిధి, వనపర్తి జిల్లా 27 : శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి జాతర సందర్భంగా పిపిఎల్ 15 ఎడిషన్ ఫైనల్లో రిషి రైడర్స్ పై మన్యం రైడర్స్ టీం ఘన విజయం సాధించడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి మన్యం రైడర్స్ 10 ఓట్లు పూర్తిచేసుకుని 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేయడం జరిగింది.తదనంతరం 103 పరుల విజయ లక్ష్యంతో తో బర్లో దిగినటువంటి రిసీ రైడర్ టీం ఐదు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేయడం జరిగింది. ఇట్టి పిపిఎల్ 15 ఎడిషన్ కు మొదటి నగదు బహుమతి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి వనపర్తి నియోజ కవర్గం శాసనసభ్యులు 50వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో నగదు బహుమతి బి జగన్నాథం నాయుడు 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మూడవ నగదు బహుమతి బుసిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 20000 రూపాయలను అందించడం జరిగింది. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు..





