నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి (కోక్కుల వంశీ) : రుద్రంగి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతిని బొమ్మెన గ్రామానికి చెందిన బెంగళూర్ స్థిర నివాసి రంజిత్ రెడ్డి ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి మాట్లాడుతూ.. ఇటీవల నూతనంగా రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే శాలువాతో సన్మానించిన రంజిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం,మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, తూము జలపతి,రోమాల ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





