Wednesday, January 21, 2026

ఎం.జీ.ఎం. (పి.పీ.యూనిట్) పరిశీలన

  • ఎం.జీ.ఎం. (పి.పీ.యూనిట్) ను పరిశీలించిన డిప్యూటీ డీ.ఎం.అండ్ హెచ్. ఓ. డాక్టర్. మోహన్ సింగ్

నేటిసాక్షి, వరంగల్: వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీ.పీ.యూనిట్)ను పరిశీలించిన వర్ధన్నపేట డిప్యూటీ డీ.ఎం. అండ్.హెచ్.ఓ. డాక్టర్. మోహన్ సింగ్. ఈ సందర్భంగా డాక్టర్.మోహన్ సింగ్ మాట్లాడుతూ… ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ కు మరియు స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100% టార్గెట్ రీచ్ కావాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, చలి తీవ్రత ఎక్కువగా ఉందని సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిల్లలు మరియు వృద్ధులు ఈ సమయంలో బయట తిరుగడం మంచిది కాదని ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే స్వెటర్ కానీ ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నర్మద, ఏ.ఎన్.ఎం. సులోచిన, రామ రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News