Wednesday, March 11, 2026

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
ఖిల్లా ఘణపురం మండలం మామిడిమాడ గ్రామ శివారులోని కర్ణమోల ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
సంక్రాంతి భోగి పండుగను పురస్కరించుకొని ఏళ్ల తరబడి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఇట్టి పూజా కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరైన ఎమ్మెల్యే స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.పండగలు మన ఆచార వ్యవహారాలకు ప్రతీకలని ఇలాంటి పండగలను గ్రామస్తులందరూ కలిసి సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News